టెక్కలి డిడిఓ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చం నాయుడు
టెక్కలి డిడిఓ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చం నాయుడు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల పరిధిలో డిడిఓ కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజప్పు అచ్చం నాయుడు ప్రారంభించారు.
ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజ నిర్వహించిన మంత్రి, పట్టు మా దేవి కోనేరు గట్టును పరిశీలించారు.
ఈ గట్టుపై అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ప్రజలకు హామీ ఇచ్చారు.
అనంతరం డిడిఓ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లైవ్లో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 74 కేంద్రాలు ప్రారంభించామని, ప్రతి పల్లికి దోహదపడుతుందని తెలిపారు.
వ్యవసాయ మంత్రి కూడా లైవ్లో జిల్లా స్థాయిలో ప్రతి కేంద్రం మారుతుందని, పల్లెలకు సహాయాలు అందుతాయని అన్నారు.
Tags:
రాజకీయాలు

Comments